ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయనున్నారు.
వైద్య విద్యార్థులకు ప్రత్యేక ఫిర్యాదుల విభాగం
Nov 16 2016 4:23 PM | Updated on Mar 19 2019 6:59 PM
అమరావతి: త్వరలోనే అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ ఎన్.సుబ్బారావు తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులతో సంధ్యారాణి అనే వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రత్యేక ఫిర్యాదుల విభాగం లో ఒక మెయిల్ ఐడీ ఉంటుందని.. ఏరోజుకారోజు ఈ మెయిల్కు వచ్చిన ఫిర్యాదులను బట్టి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేస్తే ఎవరు రాశారో తెలుసుకుని, వారిపై కక్షసాధింపు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందనే.. ఇలా కొత్త తరహాలో చర్యలు చేపట్టినట్టు చెప్పారు. పీజీ వైద్యులు తనకు నేరుగా ఫోన్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తామని, వారి ఫోన్ వివరాలు, కళాశాల, విద్యార్థి పేరు, వేధిస్తున్న ప్రొఫెసర్, సమస్య తీవ్రత వంటివన్నీ ప్రత్యేకంగా రాసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement


