
'ఉగ్రభూతాన్ని తరిమికొట్టాలి'
జవానుల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఉగ్రభూతాన్ని తరిమికొట్టాలని ఏబీవీపీ టెక్నికల్ జిల్లా కన్వీనర్ విజయ్బాబు అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు సెంటర్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఏబీవీపీ కార్యకర్తలు యుద్ధరంగంలోకి దిగేందుకు సిద్ధమన్నారు. బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు, ఖలీఫాతుల్లాబాషా, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ చంద్రశేఖర్, ఏబీవీపీ నగర సంఘటన కార్యదర్శి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.