ఐపీఎల్ తరహాలో ప్రారంభంకానున్న ప్రొ కబడ్డీ లీగ్కు కేంద్ర క్రీడాశాఖ లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఈనెల 26 నుంచి ముంబైలో జరగనున్న ఈ లీగ్లో ఎనిమిది ఫ్రాంచైజీల జట్లు బరిలోకి దిగనున్నాయి.
బెంగళూరు: ఐపీఎల్ తరహాలో ప్రారంభంకానున్న ప్రొ కబడ్డీ లీగ్కు కేంద్ర క్రీడాశాఖ లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఈనెల 26 నుంచి ముంబైలో జరగనున్న ఈ లీగ్లో ఎనిమిది ఫ్రాంచైజీల జట్లు బరిలోకి దిగనున్నాయి. ‘వారసత్వ క్రీడగా వస్తున్న కబడ్డీపై దృష్టిపెట్టడం చాలా సంతోషంగా ఉంది.
ఈ క్రీడకు మార్గదర్శకత్వం చేయనున్న మషాల్ స్పోర్ట్స్ కృషి ప్రశంసనీయం. క్రీడాకారుల్లో సామర్థ్యం, బలం, నైపుణ్యం, వ్యూహం, సమష్టి కృషిని పెంపొందించేందుకు ఈ ఆట దోహదం చేస్తుంది. కాబట్టి భారత యువతను ఈ క్రీడ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం’ అని క్రీడా శాఖ సెక్రటరీ అజిత్ ఎమ్. శరణ్... ప్రొ కబడ్డీ లీగ్ను రూపొందించిన మషాల్ స్పోర్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ చారు శర్మకు రాసిన లేఖలో పేర్కొన్నారు.