ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్లో భారత్, అర్జెంటీనాల మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది.
వాలెన్సియా: ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్లో భారత్, అర్జెంటీనాల మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది. భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (16వ నిమిషంలో), రమణ్దీప్ సింగ్ (47), దేవిందర్ వాల్మీకి (57) గోల్స్ చేయగా అర్జెంటీనా నుంచి మటియాస్ (15), గోంజలో పెలియట్ (21), లూకాస్ విలా (30) గోల్స్ సాధించారు.