ప్రిక్వార్టర్స్‌లో సానియా జంట | pre quarters in sania mirza pair | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సానియా జంట

Sep 5 2016 12:46 AM | Updated on Aug 24 2018 5:21 PM

ప్రిక్వార్టర్స్‌లో సానియా జంట - Sakshi

ప్రిక్వార్టర్స్‌లో సానియా జంట

యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించారుు. దిగ్గజం లియాండర్ పేస్ పోరాటం ముగియగా..

ముగిసిన పేస్ పోరాటం


న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించారుు. దిగ్గజం లియాండర్ పేస్ పోరాటం ముగియగా... మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా.. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న జోడీలు ముందంజ వేశారుు. ఇప్పటికే పురుషుల డబుల్స్‌లో ఓడిపోరుున పేస్... మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ ఇంటిదారి పట్టాడు.

రెండో రౌండ్‌లో పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-7 (1/7), 6-3, 11-13తో ‘సూపర్ టైబ్రేక్’లో కోకో వాండెవాగె-రాజీవ్ రామ్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోరుుంది. డిఫెండింగ్ చాంపియన్‌‌స అరుున పేస్-హింగిస్ జంట సూపర్ టైబ్రేక్‌లో ఒకదశలో 8-4తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ... ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది.

 
మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) జంట 6-2, 7-6 (7/5)తో విక్టోరియా గొలుబిక్ (స్విట్జర్లాండ్)-నికోల్ మెలిచర్ (అమెరికా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో బోపన్న-గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జంట 5-7, 6-3, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో లుకాస్ కుబోట్ (పోలాండ్)-ఆండ్రియా హలవకోవా (చెక్ రిపబ్లిక్) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.  మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మాత్రం సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 3-6, 4-6తో బార్బరా క్రెజిసికోవా (చెక్ రిపబ్లిక్)-మారిన్ ద్రగాంజా (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడిపోరుుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement