న్యూఢిల్లీ: తాజాగా జరిగిన ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా కప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు పుజారా. వచ్చే ఫిబ్రవరి నుంచి 13 టెస్టులకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ జరగనుంది. ఆసీస్ ఆటగాళ్లు తమపై నోరు పారేసుకుంటే (స్లెడ్జింగ్ చేసినా) ఏం చేయాలన్న ప్లాన్స్ టీమిండియాకు ఉన్నాయని పుజారా తెలిపాడు. గతంలో ఆసీస్ గడ్డపై వారు స్లెడ్జింగ్ చేశారని, ఇప్పుడు భారత్లో అలాంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయన్నాడు. వాళ్లు స్లెడ్జింగ్ చేస్తే.. మేము కూడా మా శైలిలో అదే దూకుడు ప్రదర్శించి, ఆధిపత్యం చెలాయిస్తామని చెప్పాడు. భారత్ 120 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, ఆసీస్ 109 పాయింట్లతో టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉంది.
'కేవలం మూడో స్థానానికి తాను పరిమితం కాదని, డొమెస్టిక్ క్రికెట్లో ఈ స్థానంలో ఎన్నో విలువైన పరుగులు సాధించాను. కోచ్ అనిల్ కుంబ్లే కమిట్ మెంట్, క్రమశిక్షణతో టెస్టుల్లో అగ్రస్థానాన్ని సాధించాం. దాన్ని నిలుపుకోవడం చాలా కష్టమైన పని. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. పాజిటీవ్ ధృక్పథంతో ఉండి స్టైక్ రేట్ను పెంచుకోవడంపై దృష్టిపెడతాం. దీంతో ఆసీస్ బౌలర్లు కొత్తగా ఏదైనా ట్రై చేయడానికి చూస్తారు. మా పని సులువు అవుతుంది' అని పుజారా వివరించాడు. బౌలర్లు రాణించడంతో పాటు లోయర్ మిడిలార్డర్ గతంలో లాగానే మరిన్ని పరుగులు జతచేస్తే ఆసీస్ పై విజయం నల్లేరుపై నడకేనని పుజారా అభిప్రాయపడ్డాడు.
ఆసీస్ క్రికెటర్లు భారత్పై నోరు పారేసుకుంటే..!
Published Wed, Jan 25 2017 5:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement