తొలిసారి భారత్‌కు రానున్న దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌  | Boxer Mike Tyson to come to India for the first time | Sakshi
Sakshi News home page

తొలిసారి భారత్‌కు రానున్న దిగ్గజ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ 

Aug 14 2018 12:58 AM | Updated on Aug 14 2018 12:58 AM

Boxer Mike Tyson to come to India for the first time - Sakshi

ప్రపంచ హెవీవెయిట్‌ బాక్సింగ్‌ మాజీ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ వచ్చే నెలలో భారత్‌కు విచ్చేయనున్నారు. అంతర్జాతీయ మార్షల్‌ ఆర్ట్స్‌ లీగ్‌ ప్రాచుర్య కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సెప్టెంబర్‌ 29న ఈ వివాదాస్పద బాక్సర్‌... మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎమ్‌ఎమ్‌ఏ) ఈవెంట్‌ అయిన కుమిటే–1 లీగ్‌ను ప్రచారం చేసేందుకు ముంబై వస్తున్నారని లీగ్‌ వర్గాలు తెలిపాయి.

భారత మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారిగా జరిగే ఈ టోర్నీలో భారత్‌ తమ తొలి బౌట్‌లో యూఏఈని ఎదుర్కొంటుంది. లీగ్‌ వ్యవస్థాపకులు మొహమ్మద్‌ అలీ బుద్వాని మాట్లాడుతూ కుమిటే లీగ్‌ కోసం ప్రపంచ మాజీ చాంపియన్‌ రానుండటం ఆనందంగా ఉందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement