తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమి 

Bengal Warriors edge out Telugu Titans - Sakshi

సోనెపట్‌: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ తొలి ఓటమి చవిచూసింది. జోన్‌ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్‌ 25–30తో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరీ (2 పాయింట్లు) విఫలమవడంతో టైటాన్స్‌కు పరాజయం తప్పలేదు. విజేత జట్టు తరఫున మణీందర్‌ సింగ్‌ 11 రైడ్‌ పాయింట్లతో సత్తా చాటగా... ట్యాక్లింగ్‌లో శ్రీకాంత్‌ (3 పాయింట్లు) ఆకట్టుకున్నాడు.

టైటాన్స్‌ తరఫున నీలేశ్‌ 5 రైడ్‌ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో అబోజర్‌ మిఘాని (5 పాయింట్లు) రాణించాడు. జోన్‌ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 36–33తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో తమిళ్‌ తలైవాస్, హరియాణా స్టీలర్స్‌తో యు ముంబా తలపడనున్నాయి.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top