సాక్షి, గుంటూరు: ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న సీహెచ్ ఝాన్సీ లక్ష్మి బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు శుభారంభం చేయడంలో కీలకపాత్ర పోషించింది. తొలుత బౌలింగ్లో 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఝాన్సీ లక్ష్మి ఆ తర్వాత బ్యాటింగ్లో సరిగ్గా 100 పరుగులు చేసి సెంచరీ సాధించింది. స్థానిక జేకేసీ కాలేజీ మైదానంలో పంజాబ్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ తానియా భాటియా (108 బంతుల్లో 66; 8 ఫోర్లు), పర్వీన్ ఖాన్ (105 బంతుల్లో 43; 4 ఫోర్లు) రాణించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 98 పరుగులు జత చేశారు. ఐదు పరుగుల తేడాలో తానియా, పర్వీన్లను ఔట్ చేసిన ఝాన్సీ లక్ష్మి పంజాబ్ను కట్టడి చేసింది. ఝాన్సీ లక్ష్మితోపాటు బౌలింగ్లో అంజలి శర్వాణి (2/33), పుష్పలత (2/20) కూడా ఆకట్టుకున్నారు. 175 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్ర 46.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్ అనూష (22; 2 ఫోర్లు)తో కలిసి ఝాన్సీ లక్ష్మి (125 బంతుల్లో 100; 13 ఫోర్లు) తొలి వికెట్కు 78 పరుగులు జోడించింది. 164 పరుగులవద్ద నాలుగో వికెట్ రూపంలో ఝాన్సీ లక్ష్మి ఔటైనా మిగతా పనిని హిమబిందు (4 నాటౌట్), పుష్పలత (10 నాటౌట్) పూర్తి చేశారు.
పూనమ్ యాదవ్ 10–6–8–6
మూలపాడులో గోవాతో జరిగిన మ్యాచ్లో రైల్వేస్ 172 పరుగులతో ఘనవిజయం సాధించింది. రైల్వేస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ క్రికెటర్లు పూనమ్ రౌత్ (104; 11 ఫోర్లు, 2 సిక్స్లు), మిథాలీ రాజ్ (62; 6 ఫోర్లు) ధాటిగా ఆడటంతో తొలుత రైల్వేస్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. అనంతరం గోవా 44.1 ఓవర్లలో 72 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 10 ఓవర్లలో 6 మెయిడిన్లు వేసి కేవలం 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం విశేషం. చత్తీస్గఢ్తో జరిగిన మరో మ్యాచ్లో మహారాష్ట్ర ఐదు వికెట్లతో నెగ్గింది.
ఆంధ్రను గెలిపించిన ఝాన్సీ
Published Sun, Dec 2 2018 12:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement