వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 284 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది.
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 284 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. ఫల్కనర్(21) పరుగులు చేసి ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 47 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయి 288 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. షేన్ వాట్సన్(18) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు.