‘బాయ్’ పట్టించుకోవడం లేదు
డబుల్స్ ద్వయం జ్వాల-అశ్విని వ్యాఖ్య
బెంగళూరు: కెరీర్లో ఎన్ని విజయాలు సాధించినా భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) తమను పట్టించుకోవడం లేదని డబుల్స్ స్టార్లు జ్వాల-అశ్విని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే శిక్షణ కోసం తాము మరో ఆసియా దేశాన్ని వెతుక్కుంటున్నామని చెప్పారు. తమకు ఇప్పటి వరకు ప్రత్యేకమైన డబుల్స్ కోచ్ లేడని అశ్విని వాపోయింది.
‘ఒలింపిక్స్కు అర్హత సాధించాలంటే వచ్చే ఏడాది మాకు అత్యంత కీలకం. నేను ఎక్కువగా బెంగళూరులో ప్రాక్టీస్ చేస్తే జ్వాల హైదరాబాద్లో కొనసాగిస్తోంది. కోర్టులో మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. అయితే ఇదొక్కటే సరిపోదు. మంచి ప్రోత్సాహం అందించే వారు కావాలి’ అని అశ్విని పేర్కొంది.
మరో ఆసియా దేశంలో శిక్షణ కోసం చర్చలు జరుపుతున్నామని జ్వాల తెలిపింది. ప్రాక్టీస్ కోసం మంచి వాతావరణం కోరుకుంటున్న తాము ఇక నుంచి బాయ్పై ఎక్కువగా ఆధారపడబోమని స్పష్టం చేసింది. ఈ విషయంలో వేచి చూడాల్సిన అవసరం కూడా లేదంది. డబుల్స్కు ప్రత్యేకమైన కోచ్ కావాలని చాలాసార్లు మొరపెట్టుకున్నా బాయ్ తిరస్కరించిందని విమర్శించింది. గత కొన్నేళ్లుగా ప్రపంచ స్థాయిలో తమ ప్రదర్శనను చూసిన తర్వాతైనా... మహిళా షట్లర్లపై బాయ్ తమ దృక్పథాన్ని మార్చుకోవాలని సూచించింది.
2010 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని ఈ జోడీ ధ్వజమెత్తింది. ప్రస్తుతం టాప్ ప్లేయర్లందరూ హైదరాబాద్ క్యాంప్లో శిక్షణ తీసుకుంటుంటే తమను రెబెల్స్గా భావించి బెంగళూరుకు పంపించారన్నారు. ఇక్కడ కోచ్గానీ, ఫిజియోగానీ లేరన్నారు. మరోవైపు బెంగళూరు క్యాంప్లో ఒకే కోచ్ ఉన్నారని, మరో ఇద్దరితో పాటు ఒక సహాయక సిబ్బంది రావాల్సి ఉందని బాయ్ వర్గాలు తెలిపాయి.
శిక్షణ కోసం మరో దేశానికి వెళతాం!
Published Sat, Dec 6 2014 12:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement