అంబటి రాయుడిపై ఐసీసీకి ఫిర్యాదు

Ambati Rayudu Reported For Suspect Bowling Action - Sakshi

సిడ్నీ: టీమిండియా క్రికెటర్‌, హైదరాబాద్‌ ఆటగాడు అంబటి రాయుడిపై ఐసీసీకి ఫిర్యాదు అందింది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాయుడు రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే రాయుడి బౌలింగ్‌ యాక్షన్‌ అనుమానస్పదంగా ఉందని మ్యాచ్‌ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. దీన్ని స్వీకరించిన ఐసీసీ.. రాయుడు మరో 14 రోజుల్లో బౌలింగ్‌ యాక్షన్‌ నిరూపించుకోవాలని పేర్కొంది.

రెండు ఓవర్లపాటు బౌలింగ్‌ చేసిన అంబటి రాయుడు 13 పరుగులు ఇచ్చాడు. ఇక ఈ వ్యవహారంపై బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా  మంగళవారం జరిగే రెండో వన్డే కోసం ఇరుజట్లు అడిలైడ్‌ చేరుకున్నాయి. తొలి వన్డేలో భారత్‌ 34 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top