పాక్‌తో మ్యాచ్‌కు 20 వేల మంది భారతీయులు | 20 thousand Indians for the match with Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌తో మ్యాచ్‌కు 20 వేల మంది భారతీయులు

Nov 12 2014 12:52 AM | Updated on May 29 2019 2:49 PM

పాక్‌తో మ్యాచ్‌కు 20 వేల మంది భారతీయులు - Sakshi

పాక్‌తో మ్యాచ్‌కు 20 వేల మంది భారతీయులు

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది జరిగే ఈ మెగా టోర్నీలో....

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వచ్చే ఏడాది జరిగే ఈ మెగా టోర్నీలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు 20 వేల మంది భారతీయులు తమ దేశానికి వచ్చే అవకాశం ఉందని దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఫిబ్రవరి 15న అడిలైడ్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.

50వేలకు పైగా సామర్థ్యం ఉన్న ఈ స్టేడియం సాధారణ టిక్కెట్లు కేవలం 12 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. అయితే అభిమానులు ఇప్పటికీ హాలీడే, బిజినెస్ ప్యాకేజి టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని దక్షిణ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ జాన్ రౌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement