వైరల్‌ వీడియో: ఇద్దరిపై చిరుత పంజా! | leopard Was Attacking Man In Nashik | Sakshi
Sakshi News home page

మళ్లీ చిరుత పంజా, వీడియో వైరల్‌

May 30 2020 11:14 AM | Updated on May 30 2020 11:42 AM

leopard Was Attacking Man In Nashik - Sakshi

ముంబై‌: లాక్‌డౌన్‌తో జనావాసాలు నిర్మానుష్యంగా మారడంతో జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా చిరుతలు తరచుగా జనావాసాల్లోకి వచ్చి దాడులు చేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని నాశిక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందిరా నగర్‌లో రోడ్డు‌ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై ఓ చిరుత అనూహ్యంగా దాడికి దిగింది. ఈ దాడిలో ఇరువురిని తీవ్రంగా గాయపరిచింది. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇక ఇటీవల హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో, నల్లగొండ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. వీటిని పట్టుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement