
దిబ్రూగఢ్: సరదాగా నేషనల్ పార్క్ సందర్శనకు వెళ్లిన పర్యాటకలకు ఊహించని పరిణామం ఎదురైంది. పర్యాటకులు పార్కులో సంచరిస్తున్న సమయంలో ఓ ఖడ్గమృగం వారి వాహనంపైకి దూసుకెళ్లింది. వాహనంపై దాడి చేయబోయింది. దీంతో, అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వివరాల ప్రకారం.. అసోంలోని మానస్ నేషనల్ పార్క్లో పర్యాటకులు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఒకచోట ఆగిన పర్యాటకులు.. అక్కడున్న ఖడ్గమృగాలను చూస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఖడ్గమృగం.. పర్యాటకుల వైపు దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా.. పర్యాటకులు ఉన్న వాహనంపై దాడి చేసింది. వాహనాన్ని ముందుకు, వెనక్కు లాగుతూ.. వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. ఖడ్గమృగం ఇలా దాడి చేయడంతో పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
అనంతరం, కొద్దిసేపటికే ఖడ్గమృగం అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
In Manas National Park in Assam, this furious rhino has attacked a tourist vehicle no less than five times.
Each day, rhino charges at the mere sight of humans.
The reason behind its anger toward people remains a mystery. pic.twitter.com/mE3V6TT04z— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) May 29, 2025