ప్రత్యర్థి పార్టీని మట్టికరిపించేలా పనిచేయండి

YSR Congress Party Leader Sajjala Ramakrishna Reddy Instructions to Party booth committee Leaders - Sakshi

పార్టీ బూత్‌ కన్వీనర్లకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచన

ఒంగోలులో వైఎస్సార్‌ సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్ల సమావేశం

సాక్షి, ఒంగోలు : పార్టీని వ్యవస్థాగతంగా మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఒంగోలులో శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కమిటీ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా హాజరైన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఏ రాజకీయ పార్టీకైనా క్షేత్రస్థాయిలోని బూత్‌ కమిటీలే వెన్నెముక అని అన్నారు. ప్రత్యర్థి పార్టీని మట్టికరిపించేలా బూత్‌ కన్వీనర్లు కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బూత్‌ కన్వీనర్లకు సజ్జల సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top