జగన్‌ పోరాటపటిమ స్ఫూర్తితో.. | TDP Leaders And Activists Join In YSRCP | Sakshi
Sakshi News home page

జగన్‌ పోరాటపటిమ స్ఫూర్తితో..

Apr 30 2018 6:53 AM | Updated on Aug 24 2018 2:33 PM

TDP Leaders And Activists Join In YSRCP - Sakshi

న్యాయవాది అబీద్‌ అలీఖాన్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలు ఎమ్మెల్యే ముస్తఫా, అంబటి, శ్రీకృష్ణదేవరాయలు

పట్నంబజారు(గుంటూరు): స్థానిక 12వ డివిజన్‌ పరిధిలోని టీడీపీకి చెందిన న్యాయవాది పఠాన్‌ ఆబీద్‌అలీఖాన్‌ 100 మంది కార్యకర్తలతో ఆదివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. రింగు రోడ్డు సమీపంలో శ్రీకృష్ణదేవరాయులు నివాసంలో పార్టీ చేరిన వారికి వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా  అధ్యక్షుడు రావి వెంకటరమణ, నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయులు, పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి కండువాలు కప్పి స్వాగతం పలికారు.

తొలుత వైఎస్సార్‌ సీపీ కార్యాలయం నుండి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీలో చేరిన వారిలో సాజీద్‌ అలీఖాన్, జావీద్‌ అలీఖాన్, షేక్‌ బాబు, ఫిరోజ్, వాహిద్‌ అలీఖాన్, మన్నన్, ఎండీ ఫక్రుద్దీన్, సయ్యద్‌ అలీం, కరీం, షేక్‌ షబ్బీర్, చాంద్‌బాషా, మెహామూద్, బత్తుల రవికుమార్‌ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వాకా శ్రీనివాసరెడ్డి(బెంజి), షేక్‌ సలీం, మోయిన్, హన్ను పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement