రేవంత్‌ను కలిసిన మందకృష్ణ | Munda Krishna meets Revant | Sakshi
Sakshi News home page

రేవంత్‌ను కలిసిన మందకృష్ణ

Feb 4 2018 2:56 AM | Updated on Feb 4 2018 2:56 AM

Munda Krishna meets Revant - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్‌ అధినేత మంద కృష్ణమాదిగ శనివారం భేటీ అయ్యారు. వర్గీకరణకోసం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో లేఖను రాయించాలని రేవంత్‌ని మందకృష్ణ కోరారు. వర్గీకరణ ఉద్యమం న్యాయమైనదని, దీని గురించి ఇప్పటికే ఢిల్లీలోని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తన వంతు ప్రయత్నం, సహకారం అందిస్తానని తెలిపారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయేలా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడతానని రేవంత్‌ భరోసానిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement