అసలు వారి ఎజెండా పాకిస్థాన్‌ జెండా: బీజేపీ | BJP Chief Spokesperson Krishna Sagar Rao Slams On Asaduddin Owaisi | Sakshi
Sakshi News home page

ఎంఐఎం వ్యాఖ్యాలను ఖండించాలి: కృష్ణసాగర్‌ రావు

Feb 21 2020 3:21 PM | Updated on Feb 21 2020 3:27 PM

BJP Chief Spokesperson Krishna Sagar Rao Slams On Asaduddin Owaisi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌లో లౌకికవాదం అనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ బయట మాత్రం మతం పేరిట దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్‌ రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం మత విద్యేషాలు రెచ్చగొట్టే పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను ఆధారం చేసుకుని ఎంఐఎం దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుందని విమర్శించారు. అదే విధంగా ఎంఐఎంకు తోడు పార్టీలుగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మారాయన్నారు. భారతదేశం నడి బొడ్డున ఎంఐఎం మీటింగ్‌లో ఒక అమ్మాయి పాకిస్థాన్‌ జిందాబాద్‌ అని నినాదాలు చేసిందని, గతంలో ఎంఐఎం సీనియర్‌ నేత వారీస్‌ పఠాన్‌ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, సెక్యులర్‌ అని చెప్పుకునే కాంగ్రెస్‌, వామపక్షాలు ఇతర పార్టీలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఎంఐఎం హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందువులను ఇన్ని మాటలు అంటుంటే రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు ఎక్కడకు వెళ్లారని ధ్వజమెత్తారు. భారతదేశ ముస్లీంలు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలను.. ఎంఐఎం పార్టీ వ్యాఖ్యాలను ఖండించాలని పిలుపునిచ్చారు. సీఏఏ వ్యతిరేక ఊరేగింపులకు భారదేశ జెండా పట్టుకుని తిరగడం ఒక డ్రామా వాళ్ల అసలు ఎజెండా పాకిస్థాన్‌ జెండా అంటూ కృష్ణ సాగర్‌ విమర్శించారు.

సీఏఏకు వ్యతిరేక నిర్ణయం చరిత్రాత్మకం

Advertisement
 
Advertisement
Advertisement