ఏఓబీలో మరో ఎన్‌కౌంటర్‌: మావోయిస్టు మృతి

విజయనగరం : తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం వద్ద జరిగిన ఎన్‌ కౌంటర్‌ ఘటన మరవక ముందే ఓవోబీలో మరో ఎన్‌ కౌంటర్‌ జరిగింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని కటాఫ్ ఏరియాలో లుకాపాణి వద్ద మావోయిస్టులకు బీఎస్ఎఫ్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతుడి వద్ద ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top