పేదలకే భూములు దక్కాలి | Pilgrims lands should be deserved for Poor people | Sakshi
Sakshi News home page

పేదలకే భూములు దక్కాలి

Jan 2 2015 2:51 AM | Updated on Sep 2 2017 7:04 PM

అయోధ్యలో రామమందిరాన్ని త్వరగా నిర్మించాలని ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్ ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం.

అయోధ్యలో రామమందిరాన్ని త్వరగా నిర్మించాలని ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్‌నాయక్ ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యం పౌరులదే కాని కంటికి కనిపించని వివిధ మతాల దేవుళ్లది, దేవతలది కాదు. చరిత్రలో ఆధారాలు లేని విషయాలపై ఆధారపడి ఇప్పుడు వారికి మళ్లీ మందిరాలు కడతామని వాదులాడుకోవడం కంటే సెంటు భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వ భూములు, బంజ ర్లను, వినియోగం లేకుండా మతసంస్థల స్వాధీనంలో ఉన్న భూములను కేటాయించాలి.
 
 ఇదే నిజమైన మానవ సేవ అవుతుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా భూమిని జాతీయం చేసి, భూములను అమ్మడం కొనడం రద్దు చేసి భూమిని దున్ని, పంటలు పండించే వ్యక్తులకు అందిస్తే దేశం బాగుపడుతుంది. ఆధునిక దేవాలయాలుగా పేరొందిన పెండింగులో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, నదుల అనుసంధానంతో సాగు నీరు, తాగునీరు అందించాలి. కోట్లాది మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఇంత కీలకాంశాన్ని విస్మరించి దేవుళ్లపేరిట, మతాల పేరిట దశాబ్దాలపాటు దావాలు వేస్తూ, ఘర్షణలకు దిగటం మన దేశానికేమాత్రం మంచిది కాదు. ప్రభుత్వం సమష్టి వ్యవసాయ క్షేత్రాల ను ఏర్పాటు చేసి 80 శాతం పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించాలి.
 పి.గంగునాయుడు  శ్రీకాకుళం

Advertisement

పోల్

Advertisement