ప్రభుత్వ సంస్థల్లో యోగా బ్రేక్‌ | Yoga Break In Government Institutions | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సంస్థల్లో యోగా బ్రేక్‌

Jan 15 2020 3:31 AM | Updated on Jan 15 2020 3:31 AM

Yoga Break In Government Institutions - Sakshi

న్యూఢిల్లీ: వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించిన 5 నిమిషాల యోగా విరామం (వై–బ్రేక్‌) త్వరలోనే ప్రభుత్వ, కార్పొరేట్‌ సంస్థల్లో అమల్లోకి రానుంది. ఈ యోగా బ్రేక్‌లో 5 నిమిషాల్లో పూర్తి చేయగల కొన్ని తేలికైన వ్యాయామాలుంటాయి. మొరార్జీ దేశాయ్‌ జాతీయ యోగా విద్యాలయం, యోగా నిపుణుల సాయంతో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఈ వై–బ్రేక్‌ ప్రొటోకాల్‌ ట్రయల్స్‌ను సోమవారం ప్రారంభించింది.

ఇందులో పాల్గొనడానికి టాటా కెమికల్స్, యాక్సిస్‌ బ్యాంక్, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ తదితర 15 సంస్థలు ఆసక్తి చూపించాయని ఓ అధికారి తెలిపారు. ఈ వై–బ్రేక్‌ అనేది యోగా కోర్సు కాదని, కానీ కోర్సుకు సంక్షిప్త ప్రారంభ మాడ్యూల్‌ అని పేర్కొన్నారు. యోగా ప్రొటోకాల్స్‌ తయారీ ప్రక్రియ 3 నెలల క్రితమే తయారైందని తెలిపారు. వై–బ్రేక్‌ అభ్యాసంలో భాగంగా ఒక బుక్‌లెట్‌ తయారు చేశామని, పనిస్థలాల్లో ఎలా ఉండాలో దానికి సంబంధించిన స్థితులతో కూడిన వీడియో చిత్రాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement