ప్రభుత్వ సంస్థల్లో యోగా బ్రేక్‌

Yoga Break In Government Institutions - Sakshi

న్యూఢిల్లీ: వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించిన 5 నిమిషాల యోగా విరామం (వై–బ్రేక్‌) త్వరలోనే ప్రభుత్వ, కార్పొరేట్‌ సంస్థల్లో అమల్లోకి రానుంది. ఈ యోగా బ్రేక్‌లో 5 నిమిషాల్లో పూర్తి చేయగల కొన్ని తేలికైన వ్యాయామాలుంటాయి. మొరార్జీ దేశాయ్‌ జాతీయ యోగా విద్యాలయం, యోగా నిపుణుల సాయంతో ఆయుష్‌ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఈ వై–బ్రేక్‌ ప్రొటోకాల్‌ ట్రయల్స్‌ను సోమవారం ప్రారంభించింది.

ఇందులో పాల్గొనడానికి టాటా కెమికల్స్, యాక్సిస్‌ బ్యాంక్, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ గ్లోబల్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ తదితర 15 సంస్థలు ఆసక్తి చూపించాయని ఓ అధికారి తెలిపారు. ఈ వై–బ్రేక్‌ అనేది యోగా కోర్సు కాదని, కానీ కోర్సుకు సంక్షిప్త ప్రారంభ మాడ్యూల్‌ అని పేర్కొన్నారు. యోగా ప్రొటోకాల్స్‌ తయారీ ప్రక్రియ 3 నెలల క్రితమే తయారైందని తెలిపారు. వై–బ్రేక్‌ అభ్యాసంలో భాగంగా ఒక బుక్‌లెట్‌ తయారు చేశామని, పనిస్థలాల్లో ఎలా ఉండాలో దానికి సంబంధించిన స్థితులతో కూడిన వీడియో చిత్రాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top