కావాలంటే సుప్రీంకు వెళ్లండి: ఎన్జీటీ

We Do Not Review The Verdict On Amaravati Construction Says NGT - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జాతీయ హరిత ట్రిబ్యునల్‌ కొట్టి వేసిన సంగతి తెలిసిందే. షరతులకు లోబడి పర్యావరణానికి విఘాతం కలగకుండా రాజధాని నిర్మాణం చేపట్టాలని తన తుది తీర్పులో పేర్కొంది. అయితే, ఆ తీర్పును పునఃపరిశీలించాలని ఈఏఎస్‌ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ ఎన్జీటీలో  పిటిషన్‌ వేసిన వేశారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులు సరిగాలేవనీ, అమరావతిలో నిర్మాణాలు ఆపాలని పిటిషనల్‌లో పేర్కొన్నారు. ట్రిబ్యునల్‌ ఈ పిటిషన్‌పై స్పందించింది. రాజధానిలో నిర్మాణాలు ఆపాలని లేవనెత్తుతున్న అంశాలతో పిటిషనర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. కానీ, ఎన్జీటీ తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top