
ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం
నాగపూర్ జిల్లాలో రెండు వేరువేరు సంఘటనలలో ఇద్దరు మైనరు బాలికలపై అత్యాచారం జరిగింది.
నాగపూర్: నాగపూర్ జిల్లాలో రెండు వేరువేరు సంఘటనలలో ఇద్దరు మైనరు బాలికలపై అత్యాచారం జరిగింది. పోలీసుల కథకం ప్రకారం జిల్లాలోని పిప్లా గ్రామంలో నిన్న సాయంత్రం తుషార్ మిస్కిన్ అనే యువకుడు 8 సంవత్సరాల బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి పొలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు తుషార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ఐపిసి 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరో సంఘటన దిఘోరి గ్రామంలో జరిగింది. సమిత్ సతిబాబ్నే అనే యువకుడు గత ఏడాది నుంచి 17 ఏళ్ల బాలికను బెదిరించి అత్యారం చేస్తున్నాడు. ఆ బాలిక గర్భవతి అయింది. పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. దాంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమిత్ని అరెస్ట్ చేశారు. అతనిపై ఐపిసి సెక్షన్ 376, 506 కింద కేసు నమోదు చేశారు.