పాక్‌ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి | civilians killed, four injured in ceasefire violation by Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి

Jan 19 2018 9:45 AM | Updated on Aug 25 2018 5:41 PM

Two civilians killed, four injured in ceasefire violation by Pakistan - Sakshi

శ్రీనగర్‌ : పాకిస్తాన్‌ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్‌లోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో భారత జవాన్లపై  పాక్‌ జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా భారత్‌లో సరిహద్దు వెంట పాకిస్తాన్‌ జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను, మరో యువతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆర్‌ఎస్‌ పురా, ఆర్నియా, రామ్‌గఢ్‌ సెక్టార్లలోని భారత ఔట్‌ పోస్టులపై బుధవారం నుంచి పాక్‌ కాల్పులు ప్రారంభించిందని బీఎస్‌ఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ 78వ బెటాలియన్‌కు చెందిన తమిళనాడు వాసి, హెడ్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌ చనిపోయారు. సరిహద్దులో కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement