ఇన్చార్జి సూపరింటెండెంట్గా కల్యాణి
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి డీఎంహెచ్వో కార్యాలయ ఇన్చార్జి సూపరింటెండెంట్గా అమరేష్ కల్యాణిని నియమిస్తూ ఇన్చార్జి డీఎంహెచ్వో చంద్రశేఖర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన శ్రీనివాస్నాయక్పై పలు ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడంతో ఆయన స్థానంలో ఇన్చార్జిని నియమించారు. ఆమె శనివారం బాధ్యతలు స్వీకరించారు.
ధాన్యం రవాణాకు
వాహనాలను సమకూర్చాలి
కామారెడ్డి క్రైం : కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యం తరలించడానికి అవసరమైన వాహనాలను రవాణా శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు సమకూర్చాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సూచించారు. ధాన్యం రవాణాపై కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే లారీలు ఏర్పాటు చేసి మిల్లులలో అన్లోడ్ అయ్యేలా సహకరించాలని కోరారు. డీఎస్వో మల్లికార్జున్ బాబు, సివిల్ సప్లయ్ ఇన్చార్జ్ డీఎం నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.
ఈఏపీసెట్లో ప్రతిభ
కామారెడ్డి టౌన్ : ఈఏసీసెట్ ఫలితాల్లో జి ల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటా రు. జిల్లా కేంద్రంలోని సాందీపని కళాశాల లో చదివిన అమూల్యరెడ్డి 817వ ర్యాంకును సాధించింది. మాచారెడ్డి మండలం అన్నా రం గ్రామానికి చెందిన అమూల్యరెడ్డి భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవడమే తన లక్ష్యం అన్నారు. పట్టణానికి చెందిన పందిరి శరత్చంద్ర 4,175 ర్యాంకు సాధించాడు. ఇంజినీర్ కావడమే తన లక్ష్యం అని తెలిపా డు. విద్యార్థులను కళాశాల యజమాన్యం అభినందించింది.
ప్రజల ప్రాణాలతో
చెలగాటం ఆడొద్దు
కామారెడ్డి టౌన్ : వ్యాపారులు ప్రజల ప్రా ణాలతో చెలగాటం ఆడొద్దని కామారెడ్డి ఆ హార భద్రతా అధికారి సునిత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని హోటళ్లు, స్వీట్ దు కాణాలను ఆమె తనిఖీ చేశారు. వంట గదు లు అపరిశుభ్రంగా, కాలం చెల్లిన తినుబండారాలు, కుళ్లిన ఆహార పదార్థాలు ఉండటంతో యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేసి, జరిమానాలు విధించారు. ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపారు. తనిఖీల్లో ఫు డ్ ఇన్స్పెక్టర్ శిరీష, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యం
కొనుగోలు చేస్తాం
బీబీపేట : వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొ నుగోలు చేస్తామని డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. లారీల కొరత, మిలర్ల తీరుతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని పేర్కొ న్నారు. అయినా రైతులకు ఇబ్బందులు కల్గకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నామ ని తెలిపారు. మరో వారం రోజుల్లో కొనుగో లు ప్రక్రియ పూర్తి అవుతుందని ఆయన అ న్నారు. వర్షాలు కురుస్తున్నందున రైతులు అందుబాటులో ఉండి ధాన్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. డైరెక్టర్ మల్లేశం, రైతు లు రాజ మల్లయ్య, కిషన్రావు పాల్గొన్నారు.