కేంద్రం కరువు సాయం నాలుగోవంతే
రాష్ట్ర సర్కారు ఆశలు ఆవిరి
రైతుల ఇన్పుట్ సబ్సిడీకి కూడా సరిపోని నిధులు
కరువు మండలాల్లో నిధులకు కటకట తప్పదంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.791 కోట్ల కరువు సాయం ప్రకటించింది. కనీసం వెయ్యి కోట్ల సాయం అందుతుందని అంచనా వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.3,002 కోట్ల సాయం అందించాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలతో పోలిస్తే నాలుగో వంతే సాయం అందటం సర్కారుకు నిరాశను మిగిల్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీ మొత్తంలో సాయం ఎప్పుడూ అందించలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్సింగ్ ప్రకటించారు.
గత వారం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు కరువు సాయం కింద రూ.433 కోట్లు మంజూరు చేసింది. దీంతో పోలిస్తే తెలంగాణకు సాయం ఎక్కువే అందినప్పటికీ... కేంద్రం ఇచ్చిన నిధులు పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి కూడా సరిపోవని అధికారులు చెబుతున్నారు. దీంతో కరువు మండలాల్లో తాగునీరు, పశుగ్రాసం, ఉపాధి హామీ తదితర కార్యక్రమాలకు నిధుల కటకట తప్పదంటున్నారు.
కరువు చర్యలపై ప్రభావం
ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు మట్టి కలవడంతో రైతులు అపార నష్టాన్ని చవిచూశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. తగినంత సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది. కానీ ఆశించినంత సాయం అందకపోవటంతో కరువు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభావం పడనుంది. కరువు మండలాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీ అందివ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను 200 రోజులకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. వీటితోపాటు మంచినీటి వసతులు, పశువులకు దాణా లాంటి తక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
కరువు నివారణ శాశ్వత చర్యల్లో భాగంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భూగర్భజలాల పెంపు, అడవుల వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ కేంద్ర బృందానికి వివరించారు. కేంద్రానికి ఇచ్చిన నివేదికలోనూ వ్యవసాయ శాఖకు రూ.863 కోట్లు, గ్రామీణ మంచినీటి సరఫరాకు రూ.400 కోట్లు, పట్టణ మంచినీటి సరఫరాకు రూ.80 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్కు రూ.90 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.42 కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ.369 కోట్లు, బతుకుదెరువు ఫించన్లకు రూ.700 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించారు. కానీ కేంద్రం రూ.791 కోట్లే విడుదల చేయటంతో ఏ మూలకూ సరిపోయేలా లేవని ప్రభుత్వ వర్గాలు నిట్టూరుస్తున్నాయి. దీంతో కరువు ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాల భారం కూడా రాష్ట్ర ఖజానాపైనే పడటం ఖాయమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
అడిగింది రూ.3 వేల కోట్లు.. ఇచ్చింది రూ.791 కోట్లు
Published Fri, Jan 15 2016 3:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement