అమానుషం: విద్యార్థితో చెప్పులు తీయించిన మంత్రి | Tamil Nadu Minister Asks Tribal Boy To Remove Slippers | Sakshi
Sakshi News home page

అమానుషం: విద్యార్థితో చెప్పులు తీయించిన మంత్రి

Feb 6 2020 4:48 PM | Updated on Feb 6 2020 5:38 PM

Tamil Nadu Minister Asks Tribal Boy To Remove Slippers - Sakshi

చెన్నై: ఓ వైపు సాంకేతికత  శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ సమాజంలో బడుగు, బలహీన వర్గాలపై కులవివక్ష మాత్రం అంతమొందడం లేదు. ఉన్నత స్థానంలో ఉన్న ఓ మంత్రి గిరిజన బాలుడిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండింగల్‌ శ్రీనివాసన్‌ గురువారం తెప్పక్కాడుకులోని ముదుమలై టైగర్‌ రిజర్వ్‌లో ఏనుగుల పునరుజ్జీవన శిబిరం ప్రారంభోత్సవానికి వచ్చారు.

ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శిబిరానికి వెళుతుండగా మం‍త్రి శ్రీనివాసన్ ఓ గిరిజన విద్యార్థిని పిలిచి.. తన కాళ్లకు ఉన్న చెప్పులు తీయాలని ఆదేశించాడు. ఏం చేయలేని స్థితిలో ఆ పిల్లవాడు అందరూ చూస్తుండగానే మంత్రి కాళ్లకు ఉన్న చెప్పలను తొలగించాడు. తర్వాత మంత్రి అక్కడ ఉన్న ఆలయంలోకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో దళిత సంఘాలు మంత్రి ప్రవర్తనపై మండిపడుతున్నాయి. గిరిజన విద్యార్థితో మంత్రి చెప్పులు మోయిస్తున్నప్పుడు అక్కడ ఉన్న అధికారులు చూస్తూ నిలుచున్నారే తప్ప ఏ ఒక్కరు ఈ పనికి అడ్డు చెప్పలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అతన్ని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement