తెలంగాణ, ఏపీ సర్కార్లకు సుప్రీం అక్షింతలు | Supreme court Serious about the police Promotions | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఏపీ సర్కార్లకు సుప్రీం అక్షింతలు

Jul 7 2014 2:25 PM | Updated on Sep 17 2018 6:18 PM

తెలంగాణ, ఏపీ సర్కార్లకు సుప్రీం అక్షింతలు - Sakshi

తెలంగాణ, ఏపీ సర్కార్లకు సుప్రీం అక్షింతలు

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.

న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.  పోలీసుల పదోన్నతుల కేసులో ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు శాఖలో పదోన్నతులపై గతంలో తామిచ్చిన ఆదేశాలు ఎందుకు పాటించటం లేదని ప్రశ్నించింది. కాగా పదోన్నతుల విషయంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేయడం లేదంటూ కొందరు పోలీసులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తూ హోంశాఖ కార్యదర్శి, డీజీపీని ప్రతివాదులుగా చేర్చిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement