న్యాయాధికారుల వేతనం మూడు రెట్లు | SC directs 30 percent interim hike in salaries of judges | Sakshi
Sakshi News home page

న్యాయాధికారుల వేతనం మూడు రెట్లు

Feb 7 2020 6:23 AM | Updated on Feb 7 2020 6:23 AM

SC directs 30 percent interim hike in salaries of judges  - Sakshi

న్యూఢిల్లీ: దిగువ కోర్టుల న్యాయాధికారుల వేతనాన్ని మూడురెట్ల వరకు పెంచాలని రెండో నేషనల్‌ జ్యుడీషియల్‌ కమిషన్‌ సిఫారసు చేసింది.  పింఛను, అలవెన్సుల మొత్తాన్ని 2016 ఏడాదినుంచి అమలయ్యేలా పెంచాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆమోదిస్తే ఇవి అమలుల్లోకి రావచ్చు. 2017లో ఏర్పాటైన ఈ కమిషన్‌ తన నివేదికను జనవరి 29న సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలోని ఈ కమిషన్‌ దిగువ కోర్టుల్లో జడ్జీల  వ్యవస్థ, పని విధానాలను పరిశీలించింది. తుది నివేదిక ప్రకారం.. జూనియర్‌ సివిల్‌ జడ్జి/ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వేతనాన్ని రూ.27,700 నుంచి రూ.77,840కు పెంచాలి. ఆపై సీనియర్‌ సివిల్‌ జడ్జి వేతనం రూ.1,11,000 లేదా, అంతకంటే ఎక్కువ.. జిల్లా జడ్జీల ప్రారంభ వేతనం రూ.1,44,840 ఉండాలి. జిల్లా జడ్జీల వేతనం గరిష్టంగా రూ.2,24,100 ఉండాలి. చివరి వేతనంలో 50 శాతం పింఛనుగా ఇవ్వాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement