ఐదుగురికి ‘సంసద్ రత్న’ | Sakshi
Sakshi News home page

ఐదుగురికి ‘సంసద్ రత్న’

Published Sun, Jun 12 2016 7:32 PM

Sansad Ratna awards conferred on five Parliamentarians

చెన్నై: ఐదుగురు ఎంపీలు శనివారం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి. రంగరాజన్ చేతుల మీదుగా ‘సంసద్ రత్న’ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డులను ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, ఈ మ్యాగజైన్ ప్రీసెన్స్ అందించాయి. వీరిలో రాజస్తాన్‌కు చెందిన పి.పి. చౌదరి(బీజేపీ), మహారాష్ట్రకు చెందిన హీనా విజయ్‌కుమార్ గావిట్(బీజేపీ), శ్రీరంగ్‌అప్పా బర్నే(శివసేన), రాజీవ్ సతాల్(కాంగ్రెస్), షిరూర్(శివసేన) ఉన్నారు. షిరూర్ మినహా నలుగురూ తొలిసారి లోక్‌సభకి ఎన్నికైన వారు.

మాజీ రాష్ట్రపతి కలాం పేరిట ఈ అవార్డులు ఇస్తున్నారు. అవార్డు విజేతలు క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరై 300-500 ప్రశ్నలను లేవనెత్తారు.
 

Advertisement
Advertisement