కథువా ఘటనను ఖండించిన కోవింద్‌ | President Ram Nath Kovind Condems Kthua Horror | Sakshi
Sakshi News home page

కథువా ఘటనను ఖండించిన కోవింద్‌

Apr 18 2018 1:41 PM | Updated on Apr 18 2018 1:41 PM

President Ram Nath Kovind Condems Kthua Horror - Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

శ్రీనగర్‌, జమ్మూకశ్మీర్‌ : కథువా గ్యాంగ్‌ రేప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్రంగా ఖండించారు. దేశం ఎటు ప్రయాణిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఇలాంటి ఘోరాలు దేశంలో జరగుతుండటం బాధాకరమని అన్నారు.

శ్రీ మాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా కథువా ఘటనను ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement