‘బ్యాంకుల ముందు ప్రజలు.. ప్రధాని ఎక్కడ?’ | opposition once again confront the Modi government over demonetisation | Sakshi
Sakshi News home page

‘బ్యాంకుల ముందు ప్రజలు.. ప్రధాని ఎక్కడ?’

Nov 28 2016 12:22 PM | Updated on Aug 21 2018 9:38 PM

డబ్బుల కోసం బ్యాంకుల వద్ద ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని లోకసభ ప్రతిపక్ష నేత మల్లి ఖార్జున ఖర్గే అన్నారు. వీటిపై ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూఢిల్లీ: డబ్బుల కోసం బ్యాంకుల వద్ద ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని లోకసభ ప్రతిపక్ష నేత మల్లి ఖార్జున ఖర్గే అన్నారు. వీటిపై ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. చర్చ జరగాలని తామంటుంటే ప్రధాని ఎక్కడికెళుతున్నారని ప్రశ్నించారు. సోమవారం కూడా పార్లమెంటు శీతాకాల సమావేశాలు కాక పుట్టిస్తున్నాయి. ప్రతిపక్షాలంతా మరోసారి ఏకతాటిపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశంలో తొలుత క్యూబా నాయకుడు ఫిడెల్‌ క్యాస్ట్రో మృతిపట్ల సంతాపం ప్రకటించాయి. ఆ తర్వాత పరిస్థితులు షరా మాములుగా తయారయ్యాయి.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement