మధ్యప్రదేశ్ గవర్నర్గా ఓపీ కోహ్లీ | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్ గవర్నర్గా ఓపీ కోహ్లీ

Published Thu, Sep 8 2016 2:28 PM

మధ్యప్రదేశ్ గవర్నర్గా ఓపీ కోహ్లీ

మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఓం ప్రకాశ్ కోహ్లీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రధేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేంద్ర మీనన్ రాజ్భవన్ లో బీజేపీ సీనియర్ నేత కోహ్లీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ పదవీ కాలం బుధవారం ముగియడంతో ప్రస్తుతం గుజరాత్ గవర్నర్ అయిన ఓ.పీ.కోహ్లీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement