
బేషరతుగా వెంటనే అభినందన్ను భారత్కు పాక్ అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: భారత పైలట్ అభినందన్ వర్థమాన్ను విడిపించుకోవడానికి పాకిస్థాన్తో ఎలాంటి ఒప్పందం చేసుకోబోమని, బేషరతుగా వెంటనే అభినందన్ను పాక్ భారత్కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అభినందన్ విడుదల విషయంలో పాక్తో ఎలాంటి చర్చలు కానీ, ఒప్పందాలు కానీ ఉండబోవని ప్రభుత్వ వర్గాలు పీటీఐ వార్తాసంస్థతో స్పష్టం చేశాయి. అభినందన్ విషయంలో కాందహర్ విమానం హైజాక్ ఘటన తరహాలో ఇచ్చిపుచ్చుకునేవీ ఏమీ ఉండవని తెలిపింది.
పాక్ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాదులు, వారి ముసుగులపై పాకిస్థాన్ సత్వరమే తగిన చర్య తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే 40మందిని పొట్టనబెట్టుకున్న పూల్వామా ఉగ్రవాద దాడికి సంబంధించిన ఆధారాలను పాక్ రాయబారికి భారత్ అందజేసింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మాట నిలబెట్టుకోవాలని, భారత్ ఇచ్చిన ఆధారాలపై దర్యాప్తు జరపాలని కేంద్రం పేర్కొంది. భారత్ పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేసిందని, కానీ, పాకిస్థాన్ భారత్లోని సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని దాడికి ప్రయత్నించిందని కేంద్రం గుర్తు చేసింది.