మాజీ కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్‌ వర్మ కన్నుమూత 

MP Beni Prasad Verma Lifeless In Lucknow - Sakshi

లక్నో: కేంద్ర మాజీ  మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బేణీ ప్రసాద్‌ వర్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయం త్రం లక్నోలోని ఓ ఆస్పత్రిలో కన్ను మూశారు. 1996–98 కాలంలో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మంత్రివర్గంలో టెలికాం మంత్రిగా, యూపీఏ 2 హయాంలో స్టీల్‌ మంత్రిగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top