-
కరోనాతో కేంద్ర మాజీ మంత్రి కుమారుడు మృతి
లక్నో : ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తూనే ఉంది. కరోనాకు సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి బేణి ప్రసాద్ వర్మ కుమారుడు దినేష్ వర్మ (40) మంగళవారం కరోనా కారణంగా మరణించాడు. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్లో ప్రభుత్వ ఉద్యోగి అయిన దినేష వర్మకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్నో నగరానికి చెందిన దినేష్కు కొద్ది రోజుల క్రితమే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. అయితే గతంలోనూ దినేష్ వర్మకు కిడ్నీ సంబంధిత సమస్యలున్నట్లు సమాచారం. 2007లో దినేష్ మూత్రపిండ మార్పిడి చేయుంచుకున్నాడని అప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన స్నేహితుడు వెల్లడించారు. (మార్నింగ్ వాక్కు వెళ్లిన బీజేపీ అధ్యక్షుడిపై దాడి ) కాగా సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడైన బేణిప్రసాద్ వర్మ కాంగ్రెస్ హయాంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు. అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది మార్చి 27న మరణించారు. నెలల వ్యవధిలోనే ఇప్పుడు కూమారుడు కూడా చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు బేణిప్రసాద్ వర్మకు ములాయం సింగ్తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దినేష్ వర్మ కుటుంబానికి సంతాపం తెలిపారు. (కరోనా ఔషధం : పతంజలి కొత్త ట్విస్టు ) -
మాజీ కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ కన్నుమూత
లక్నో: కేంద్ర మాజీ మంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయం త్రం లక్నోలోని ఓ ఆస్పత్రిలో కన్ను మూశారు. 1996–98 కాలంలో అప్పటి ప్రధాని హెచ్డీ దేవెగౌడ మంత్రివర్గంలో టెలికాం మంత్రిగా, యూపీఏ 2 హయాంలో స్టీల్ మంత్రిగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
రాహుల్ను పక్కనపెట్టే కుట్ర: బేణీ ప్రసాద్ వర్మ
లక్నో: కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబాన్ని ముఖ్యంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని పక్కన పెట్టేందుకు కొందరు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బేణీ ప్రసాద్ వర్మ సోమవారం ఆరోపించారు. ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకున్న కొందరు నేతలు కావాలనే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని, ఇటీవలి ఎన్నికల్లో వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని.. ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించకుండా ఆయన విమర్శించారు. ఎన్నికల్లో టికెట్లను అమ్ముకుని, కోట్లాది రూపాయలు సంపాదించి.. ఇప్పుడు అధినాయకత్వాన్ని విమర్శిస్తున్న వారెవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. దేశంలో మోడీకి దీటైన నేత రాహుల్ గాంధేనంటూ పార్టీ ఉపాధ్యక్షుడిపై బేణీ ప్రశంసలు గుప్పించారు. -
గాంధీ కుటుంబాన్ని పక్కన పెట్టేస్తున్నారు
ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు గాంధీ కుటుంబాన్ని.. ముఖ్యంగా ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బేణీప్రసాద్ వర్మ ఆరోపించారు. పార్టీలోనే ఉంటూ నాయకత్వాన్ని విమర్శిస్తున్న వాళ్లు ఇతర పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నారన్నారు. అయితే ఏ ఒక్కరి పేరును ఆయన ప్రస్తావించలేదు. వాళ్ల పేర్లు, ముఖాలు అందరికీ తెలుసని మాత్రం చెప్పారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లే టికెట్లు అమ్ముకుని భారీగా సొమ్ము వెనకేసుకున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్నారు. ఇంతకుముందు రాహుల్ గాంధీని పొగిడినవాళ్లే ఇప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశ్నించడం సత్సంప్రదాయం కాదని బేణీ ప్రసాద్ వర్మ చెప్పారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీయేనని, ఆయన మాత్రమే నరేంద్రమోడీని ఢీకొనగలరని అన్నారు. ఆయనకు రాజకీయాలు, సమాజం, ఆర్థికవ్యవస్థపై లోతైన పరిజ్ఞానం ఉందని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలో వస్తుందని, పార్టీని పునర్వ్యవస్థీకరించడానికి రాహుల్ త్వరలోనే చర్యలు తీసుకుంటారని బేణీ తెలిపారు. -
మోడీ ఓ జంతువు: బేణీప్రసాద్
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై అనుచిత వ్యాఖ్యల విషయంలో కేంద్ర మంత్రి బేణీప్రసాద్వర్మ వెనక్కి తగ్గలేదు. ఎన్నికల సంఘం షోకాజు నోటీసు జారీ చేసిన మర్నాడే ఆయన మరోసారి మోడీపై దూషణకు దిగారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని గోండాలో కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీలో మాట్లాడుతూ నరేంద్రమోడీ ఓ జంతువు అని, ఆయన గుణపాఠం నేర్వాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు మోడీపై వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని భావించిన ఈసీ గురువారం ఆయనకు షోకాజు నోటీసు జారీ చేసింది. మోడీ ఓ పెద్ద గూండా, హిట్లర్ వారసుడని, 20 ఏళ్ల వయసులో పెద్ద నేరం చేసి ఇంటి నుంచి పారిపోయి వచ్చాడని వర్మ ఆరోపించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement