'మహిళలు ఆగ్రహంతో ఉన్నారు' | modi comments in bihar election compaign | Sakshi
Sakshi News home page

'మహిళలు ఆగ్రహంతో ఉన్నారు'

Nov 2 2015 12:19 PM | Updated on Aug 21 2018 9:33 PM

గత పాలకుల తీరుపై బిహార్లో మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం బిహార్లోని పూర్ణియలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

బిహార్: గత పాలకుల తీరుపై బిహార్లో మహిళలు ఆగ్రహంతో ఉన్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం బిహార్లోని పూర్ణియలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిహార్ను లాలూ 15 సంవత్సరాలు, నితీష్ 10 సంవత్సరాలు పాలించారనీ, వీరి జంగిల్ రాజ్ పాలనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శంచారు.

గత పాలకులు తమ అసమర్ధతపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరముందని మోదీ అన్నారు. తాను బిహార్కు రావడాన్ని ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయో తెలియడం లేదన్న మోదీ.. ప్రజలు అభివృద్ధికి ఓటేయాలని సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement