కుర్తా పైజామా ప్రత్యేకత... | Kurta pajamas specialty | Sakshi
Sakshi News home page

కుర్తా పైజామా ప్రత్యేకత...

Nov 10 2014 2:03 AM | Updated on Aug 21 2018 9:36 PM

మోదీ మంత్రివర్గంలో కొత్తగా చేరిన 21 మంది మంత్రుల ప్రమాణ కార్యక్రమం ఆదివారం రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో కనుల .....

న్యూఢిల్లీ:  మోదీ మంత్రివర్గంలో కొత్తగా చేరిన 21 మంది మంత్రుల ప్రమాణ కార్యక్రమం ఆదివారం  రాష్ట్రపతి భవన్ దర్బార్ హాలులో కనుల పండుగగా జరిగింది.  పారికర్, సురేష్ ప్రభు, రాజ్యవర్ధన్ మినహాయిస్తే.. మిగిలిన వారంతా సంప్రదాయ కుర్తా-పైజామా ధరించి హాజరయ్యారు. 

సుజనా చౌదరి,  సుప్రియో  మినహా అందరూ హిందీలోనే ప్రమాణం చేశారు. కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకున్న వారిలో యూపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి ఒక్కరే మహిళ. ఆమె చేరికతో మంత్రివర్గంలోని మహిళల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.
 

Advertisement
 
Advertisement
Advertisement