ఇమ్రాన్‌ను అన్‌ఫాలో చేసిన దుండగులు

Jammu Kashmir Governor Twitter Account Hacked Unfollowed Pak PM - Sakshi

గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్డ్

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైంది. ఆయన పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను ఫాలో అవడమే దీనికి కారణంగా గవర్నర్‌ కార్యాలయం మంగళవారం తెలిపింది. మాలిక్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేసిన దుండగులు ఇమ్రాన్‌ను అన్‌ఫాలో చేశారని వెల్లడించింది. ఈ సంఘటను పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలాఉండగా.. పీడీపీ, బీజేపీ పొత్తు విచ్ఛిన్నం కావడంతో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసింది. దాంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.

ఇక పుల్వామా ఉగ్రదాడి అనంతరం గవర్నర్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. జమ్మూ-శ్రీనగర్‌ హైవేపై సాధారణ పౌరుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే ఆ దారిగుండా ప్రయాణం సాగించాలని ఆదేశాలు జారీ చేశారు. మిలటరీ వాహనాల రవాణా సాఫిగా సాగడానికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఆయన ప్రకటించారు. కాగా, మాలిక్‌ నిర్ణయంపై ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top