ఆ రైల్లో ఇక అర లీటరు బాటిళ్లే | Half Litre Water Bottle Supply in Shatabdi Express | Sakshi
Sakshi News home page

ఆ రైల్లో ఇక అర లీటరు బాటిళ్లే

Nov 7 2019 12:05 PM | Updated on Nov 7 2019 12:05 PM

Half Litre Water Bottle Supply in Shatabdi Express - Sakshi

న్యూఢిల్లీ: నీటి వృథాను అరికట్టే ప్రయత్నంలో భాగంగా శతాబ్ది రైళ్లలో ప్రయాణించేవారికి ఒక లీటరు ‘రైల్‌నీర్‌’ నీటి సీసాల బదులు అరలీటరు నీటి సీసాలను ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 8.5 గంటల్లోపు ప్రయాణం చేసే శతాబ్ది రైళ్లలో ఇకపై ఒక లీటర్‌ నీటి సీసాలను ఇవ్వవద్దని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం శతాబ్ది రైల్లో 5 గంటల ప్రయాణం చేసే వారికి అరలీటరు సీసాలను, అంతకంటే ఎక్కువ సేపు ప్రయాణం చేసేవారికి ఒక లీటరు నీటి సీసాలను అందిస్తున్నారు. నూతన ఆదేశాల ప్రకారం ప్రయాణికులు అడిగితే అదనపు సీసాలు ఇస్తామని, కానీ వాటికి నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement