రాజ్‌నాథ్‌కు గవర్నర్‌ నరసింహన్‌ నివేదిక! | governor narasimhan met rajnath singh | Sakshi
Sakshi News home page

హోంమంత్రి రాజ్‌నాథ్‌తో గవర్నర్‌ సమావేశం

Jan 9 2018 12:00 PM | Updated on Mar 18 2019 9:02 PM

governor narasimhan met rajnath singh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాధ్ సింగ్తో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయ, పరిపాలన పరిస్థితులపై నివేదిక  సమర్పించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. ‘ఇది సాధారణ సమావేశమే. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధల్లాంటివి. పెద్దలు, పిల్లల్ల మధ్య తలెత్తే అపార్దాలు మళ్లీ సర్దుకుంటాయి. విభజన చట్టంలో కొన్ని మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. రాజ్  భవన్ పనితీరును మరింత మెరుగు పరిచేందుకు కొన్ని సూచనలు చేశాం. ప్రజలకు రాజ్భవన్‌ను మరింత చేరువ చేస్తాం, పచ్చదనం-పరిశుభ్రత అంశాలపై దృష్టి పెట్టాం.’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement