స్మార్ట్‌ సిటీ పథకానికి రూ.9,940 కోట్లు | Government releases Rs 9940 crore to states for Smart Cities Mission | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ సిటీ పథకానికి రూ.9,940 కోట్లు

Feb 12 2018 2:54 AM | Updated on Feb 12 2018 2:54 AM

Government releases Rs 9940 crore to states for Smart Cities Mission - Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ సిటీ పథకం కింద ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.9,940 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ పథకంలో భాగంగా మహారాష్ట్రలోని 8 నగరాలకు రూ.1,378 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని 7 నగరాలకు రూ.984 కోట్లు, తమిళనాడులోని 11 నగరాలకు రూ.848 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నగరాలకు రూ.588 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాలను విడుదల చేసింది. స్మార్ట్‌ సిటీ పథకంలో చేరడానికి పశ్చిమ బెంగాల్‌ విముఖత చూపినా, కోల్‌కతాలోని న్యూ టౌన్‌కు రూ.8 కోట్లు విడుదల చేశామంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement