ఫిబ్రవరి, మార్చిలో 5 రాష్ట్రాల ఎన్నికలు? | Elections in 5 states? | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి, మార్చిలో 5 రాష్ట్రాల ఎన్నికలు?

Oct 24 2016 1:21 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఉత్తరప్రదేశ్‌తో సహా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌తో సహా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. యూపీతో పాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల షెడ్యూల్‌ను డిసెంబర్ నెలాఖరులో ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. యూపీలో 7 విడతల్లో, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌ల్లో ఒక విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. యూపీలో 15 ఏళ్లకు పైగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చే యాలనే లక్ష్యంతో ఉంది.

ఉత్తరాఖండ్‌లో  కాంగ్రెస్‌పై ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి లాభించొచ్చు. పంజాబ్‌లో అధికార అకాలీదళ్-బీజేపీ కూటమి కాంగ్రెస్, ఆప్‌ల నుంచి.. గోవాలో అధికార బీజేపీ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నాయి. మణిపూర్‌లో అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement