లండన్: యూనివర్సిటీ, కాలేజీ స్థాయి చదువు పూర్తిచేసిన భారతీయ యువతులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం కనుగొన్నారు. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఇటీవల చేసిన సర్వేలో ఓ సరికొత్త విషయాన్ని వెల్లడించారు. భవిష్యత్లో భారతీయ యువతులకు భర్తలు దొరకడం కష్టమేనని ఓ సర్వే తేల్చింది.
యూనివర్సిటీ, కాలేజీ వరకు చదివిన యువతులకు సరైన జీవిత భాగస్వామిని వెతుక్కోవడం 2050 నుంచి కష్టతరం కానుందని సర్వేలో తేలింది. 2050 నుంచి మగవారు తమకంటే తక్కువగా చదువుకున్న వారినే జీవిత భాగస్వాములుగా ఎంపిక చేసుకుంటారని ఈ పరిశోధనలో వెల్లడైంది. ది సెంటర్ ఫర్ డెమోగ్రాఫిక్ స్టడీస్ (బార్సిలోనా), మిన్నెసోటా పాపులేషన్ సెంటర్ (అమెరికా)లు ఈ సర్వేలో భాగం పంచుకున్నాయి.
ప్రస్తుతం ఉన్న పద్ధతులు, ఇతర పరిస్థితులను ఆధారంగా చేసుకుని సర్వే నిర్వహించారు. 45-49 ఏళ్ల వయసున్న అవివాహిత మహిళలు 2010లో 0.07 శాతం ఉండగా, అది 2050కి 9 శాతానికి చేరుకుంటుందని పరిశోధకులు తెలిపారు. చదువుకన్న మహిళలదే ఇందులో అగ్రభాగమని చెప్తున్నారు. తమ కంటే తక్కువగా చదువుకున్న వారినే వివాహం చేసుకోవాలని మగవారు భావించడంతో అవివాహిత మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్ని సర్వేలలో వెల్లడైంది.
జాతీయ కుటంబ ఆరోగ్య సర్వే (భారత్) 2005-06, భారత సామాజిక-ఆర్థిక సర్వే (1999, 2004) వివరాలను పూర్తిగా విశ్లేషించిన ఈ బృందం 50 ఏళ్ల వరకు అవివాహితులైన పురుషులు 1.2 శాతం ఉండగా, మహిళలు 0.6 శాతంగా ఉందని గుర్తించారు. ఈ సర్వేలతో పాటు పురుషులు, మహిళల వయసు, చదువు ఆధారంగా చేసుకుని 2050లో ఉండబోయే పరిస్థితులను తెలిపారు.
2010లో యూనివర్సిటీలో చదువుతున్న పురుషులు 151 మందికి గానూ మహిళలు 100 మంది మాత్రమే ఉన్నరని ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్ అనాలిసిస్, వియన్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోగ్రఫీ సంస్థలు పేర్కొన్నాయి. 2050 ఏడాదికి పురుషులు 92 మాత్రమే ఉండాగా కాలేజీలో చదువుతున్న యువతులు 100 మంది ఉంటారని అంచనాలు వేశారు.
భవిష్యత్లో భర్తలు దొరకడం కష్టమే!
Published Thu, Feb 5 2015 11:44 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ వడ్డాది
300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ
పేరంటాలమ్మ తిరునాళ్లు
ప్రాణం తీసిన ఈత సరదా
టీడీపీ నాయకులపై అట్రాసిటీ కేసు
రేపు ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ మెగా లోన్ మేళా
దాత సహకారంతో నిర్మాణం
సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మహిళల స్వయం సమృద్ధికి పనికల్పన : డీఈఓ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష షురూ
తప్పక చదవండి
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement