'నీతివంతమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారు' | Delhi wants honest government: Manish Sisodia | Sakshi
Sakshi News home page

'నీతివంతమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారు'

Feb 10 2015 10:01 AM | Updated on Mar 29 2019 9:31 PM

'నీతివంతమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారు' - Sakshi

'నీతివంతమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారు'

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్నే ఏర్పాటు దిశగానే పయనిస్తోంది.

న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ  సొంతంగానే ప్రభుత్వాన్నే ఏర్పాటు దిశగానే పయనిస్తోంది.ఈ ఎన్నికల్లో ఆప్ అనుకున్న సీట్లకంటే అత్యధిక స్థానాల్లో దూసుకుపోతుండటంతో ఆ పార్టీ నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు ఆప్ అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ నేత మనీష్ శిసోడియా సంతోషం వ్యక్తం చేశారు.

 

ఈ ఎన్నికల్లో ప్రజలు నీతివంతమైన ప్రభుత్వానికే మొగ్గు చూపారని ఆయన అన్నారు.'ఢిల్లీ ప్రజలు నీతివంతమైన ప్రభుత్వాన్ని కోరుకున్నారు.మా వద్ద ఢిల్లీ అభివృద్ధి కొరకు పక్కా ప్రణాళిక ఉంది. ఢిల్లీ కి స్వచ్ఛమైన పాలన ఇవ్వడానికి మంచి నాయకుడ్ని కల్గి ఉన్నాం'అని మనీష్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement