'ప్రజల తీర్పును స్వాగతిస్తాం' | Delhi election results 2015: Congress will respect people's verdict, says Chacko | Sakshi
Sakshi News home page

'ప్రజల తీర్పును స్వాగతిస్తాం'

Feb 10 2015 11:38 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందని కాంగ్రెస్ నేత పీసీ ఛాకో అన్నారు.

న్యూఢిల్లీ:  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2015 ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందని కాంగ్రెస్ నేత పీసీ ఛాకో మంగళవారం వ్యాఖ్యానించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్దే పైచేయి అంటూ ఎగ్జిట్ ఫోల్స్ వెల్లడించిన నేపథ్యంలో ఆ లెక్క తప్పు కాదని తాను అభిప్రాయ పడుతున్నట్టు చెప్పారు. ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు కాంగ్రెస్కు భిన్నంగా ఉన్నప్పటికీ తుది ఫలితాలు బయటకు వచ్చిన తరువాత పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అంతా అయిపోలేదని, ముందు మునిషిపల్ ఎన్నికలు ఉన్నాయంటూ చాకో గుర్తు చేశారు. ఈ మునిషిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓడిపోయినట్లయితే ప్రజల తీర్పుకు కట్టుబడుతామన్నారు. ఆపై ప్రజలలో నమ్మకం కలిగించేలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషిచేస్తామని చాకో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement