రాహుల్ గాంధీకి సమన్లు | Court asks Rahul Gandhi to be present on May 8 hearing in connection to RSS remark | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీకి సమన్లు

Mar 30 2015 2:23 PM | Updated on Oct 16 2018 2:49 PM

మహారాష్ట్రలోని భివాండీ కోర్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం సమన్లు జారీ చేసింది.

ముంబై:   మహారాష్ట్రలోని  భివాండీ కోర్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం సమన్లు  జారీ చేసింది.  ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే  దాఖలు చేసిన పరువునష్టం  కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు  గైర్హాజరు కావడంతో కోర్టు  ఈ ఆదేశాలు  జారీ చేసింది. వ్యక్తిగత కారణాల రీత్యా కోర్టు హాజరు కాలేకపోతున్నారంటూ  రాహుల్  న్యాయవాది పిటిషన్ను  హైకోర్టు తిరస్కరించింది. మే 8 న కోర్టు కు  హాజరుకావాలని  ఆదేశించింది.గత లోకసభ ఎన్నికల ప్రచారంలో  ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు  చేశారంటూ ముంబై హైకోర్టులో రాహుల్ గాంధీపై డిఫమేషన్  కేసు దాఖలైన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement