ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి | Bus rammed into a tractor trolley on Lucknow Agra expressway | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

May 18 2019 10:49 AM | Updated on May 18 2019 10:56 AM

Bus rammed into a tractor trolley on Lucknow Agra expressway - Sakshi

ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.

లక్నో :  ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో- ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఉన్నవ్‌లో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement