న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతాల్లో పొరుగు దేశం నుంచి దాడులు పెరుగుతున్న సమయంలో భారతీయ వాయుదళాధిపతి బీఎస్ ధనోవా భారత వాయు సేన(ఐఏఎఫ్)లో పని చేసే 12వేల మంది అధికారులకు ఓ లేఖ రాశారు. 'అతి కొద్ది సమయంలో ఆపరేషన్లకు సిద్ధం కావాలి. ప్రస్తుత పరిస్ధితుల్లో దాయాది దేశంతో పెద్ద ప్రమాదం పొంచి వుంది. అతి కొద్ది రోజుల్లో అందుబాటులో ఉన్న వనరులతో ఆపరేషన్స్కు దిగాల్సిన పరిస్ధితి ఉంది. ఇందుకోసం మీరందరూ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. ట్రైయినింగ్లో అందుకు తగిన విధంగా తర్పీదు పొందాలి' ఇది ఆ లేఖ సారాంశం.
ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్ధ కథనాన్ని ప్రచురించింది. నెల రోజుల క్రితం ధనోవా ఈ లేఖను ఐఏఎఫ్ అధికారులకు రాశారని తెలిపింది. ధనోవా లేఖను విశ్లేషించిన నిపుణులు.. పాకిస్తాన్తో యుద్ధం గురించే ఎయిర్ చీఫ్ ఈ లేఖను అధికారులకు రాసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అడ్డుకునేందుకు వాయుసేనను రంగంలోకి త్వరలో దింపబోతున్నారనడానికి ఈ లేఖ సంకేతమని అంటున్నారు.
వాయుసేనలో మొత్తం 42 స్వాడ్రన్లకు అనుమతి ఉన్నా.. కేవలం 33 స్వాడ్రన్లకు సరిపడే విమానాలు మాత్రమే భారత్కు అందుబాటులో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న వనరులతో ఆపరేషన్స్కు దిగాలని అధికారులను లేఖ ద్వారా ధనోవా కోరారని నిపుణులు చెబుతున్నారు. జరగబోయే దాన్ని ఆపలేం.. ప్రొఫెషనల్గా వ్యవహరించి యుద్ధానికి సిద్ధం కావాలని కోరడంలో ఉన్న ఆంతర్యం ఇదేనని అన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం శత్రువును కూడా బలంగా మార్చిందనే విషయాన్ని మర్చిపోకూడదని, అప్పుడే విజయం సాధించగలమనే ధనోవా సూచనను ఆయన దూరదృష్టికి నిదర్శనంగా పేర్కొన్నారు.
యుద్ధానికి సంబంధించిన విషయాలనే కాకుండా.. ఎయిర్ఫోర్స్ను పీడిస్తున్న రెండు విషయాలను ప్రస్తావించారు. అవి ఒకటి ఫేవరేటిజం, రెండు లైంగిక వేధింపులు. ప్రత్యేక ఆపరేషన్స్కు అధికారుల ఎంపికలో నిజాయితీ కనిపించడం లేదని ఆవేదనను లేఖలో వెలిబుచ్చారు ధనోవా. సీనియర్లు జూనియర్లను ప్రోత్సహించాలే తప్ప వేధించకూడదని అది సేనకు ఎంతమాత్రం సహాయపడదని చెప్పారు. ఈ రెండు ప్రొఫెషనలిజాన్ని దెబ్బతీస్తాయని.. ప్రొఫెషనలిజం దెబ్బతిన్న చోట గెలుపు ఉండదని వ్యాఖ్యానించారు.
ఆ లేఖ సారాంశం.. పాక్తో యుద్ధమా?
Published Sat, May 20 2017 5:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement